మంచిర్యాలటౌన్/ గర్మిళ్ల, డిసెంబర్ 9 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత బస్ ప్రయాణం, జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య శ్రీ సేవలను ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం పొందవచ్చునని తెలిపారు. గుర్తింపు పొందిన దవాఖానలో ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉంటుందని, అక్కడ ఉన్న సిబ్బందికి తెల్లరంగు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర వివరాలు అందించాలని పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వమే వైద్యానికి అయ్యే ఖర్చులు భరిస్తుందన్నారు. మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలు, ట్రాన్స్జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచింతగా ప్రయాణించవచ్చునని తెలిపారు. వారం పాటు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం లేదని, తదుపరి నిబంధనలు వచ్చే వరకు ఉచితంగా ప్రయాణించవచ్చునని చెప్పారు. అనంతరం జీరో టికెట్ను మహిళలకు అందజేసి, అదే బస్సులో ఆయన కూడా ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఎంసీహెచ్ ఆర్ఎంవో భీష్మ, టీవీవీపీ దవాఖానల జిల్లా సూపరింటెండెంట్ అరవింద్, డీటీవో కిష్టయ్య, ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, డిసెంబర్ 9 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్స్పెషాలిటీ దవాఖాన ప్రాంగణంలో ఆర్టీసీ బస్సులో మహిళాలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకాలను అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ప్రతి మహిళా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. ఆరోగ్య కింద రూ.10 లక్షల వరకు వైద్య సాయం పొందవచ్చని తెలిపారు. అనంత రం బస్సులో మహిళలు, విద్యార్థినులకు కలెక్టర్ జీరో టికెట్ అందించారు. వారితోనే ప్రభుత్వ ద వాఖాన నుంచి మావల చౌరస్తా, తిరిగి కలెక్టర్ చౌ క్ నుంచి దవాఖాన వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప రవాణ అధికారి పుప్పాల శ్రీనివాస్, ఆర్టీసీ ఆర్ఎం సొలెమా న్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఆర్ఎంవో డాక్టర్లు ఇద్రిస్అక్బా నీ, చాంపత్రావు, డీఎం కల్పన, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఎస్పీ వీ ఉమేందర్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఉట్నూర్, డిసెంబర్ 9 : ఉట్నూర్ ఆర్టీసీ డిపో లో మహాలక్ష్మి పథకాన్ని అధికారులతో కలిసి ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్సీ నగేందర్, ఎస్ఐ మనోహ ర్, మహిళలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్/నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 9 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖాన ఆవరణలో మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. బస్సుకు రిబ్బన్ కట్చేశారు. బస్సుల్లో జీరో టికెట్, ఆరోగ్య శ్రీ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కిషోర్, సూపరింటెండెంట్ సునీల్, డీఎంహెచ్వో ధన్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేందర్, డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి, జిల్లా రవాణ శాఖ అధికారి అజయ్ కుమార్ రెడ్డి, వైద్యులు దేవేందర్రెడ్డి, రజిని, నర్సింగ్ సూపరింటెండెంట్ భారతి, ఆరోగ్య శ్రీ టీం లీడర్ భూంరెడ్డి, వైద్య సిబ్బంది, ఆర్టీసీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబర్ 9 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలను కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణంపై మహిళలతో సిబ్బంది మర్యాదపూర్వంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మీరా శ్యాంనాయక్, చరణ్, మురళి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.