భీమారం, ఏప్రిల్ 6: గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. భీమారం మండలంలోని ఆరెపల్లి, ఎల్కేశ్వరం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు.
కొత్తపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తక్కువ ఉండడం వలన గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికీ నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు, కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎల్కేశ్వరంలో హరితహారం నర్సరీని పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి నవ్యను అభినందించారు. మండల ప్రత్యేకాధికారి చిన్నయ్య, ఎంపీడీవో రాధారాథోడ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.