నస్పూర్, జనవరి 24 : జాతీయ విపత్తులు, వాటి వలన ఏర్పడే పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన అవసరమని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఇన్స్పెక్టర్ బీటెన్సింగ్, ఆర్డీవోలు రాములు, హరికృష్ణలతో కలిసి ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన దళం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ విపత్తులు సంభవించిన సమయంలో చేపట్టాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీఆర్ ద్వారా తక్షణ వైద్య సాయమందించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, డీఈవో యాదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.