నిర్మల్ టౌన్, నవంబర్ 20 : నిర్మల్ జిల్లాలో ఈనెల 30న జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లను పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. నిర్మల్లోని మంజులాపూర్లోని ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని అకస్మికంగా పరిశీలిం చారు. ఇప్పటివరకు జరిగిన ఓటరు స్లిప్పుల పంపి ణీని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కొండాపూర్ సెయింట్ థామస్ చెక్పోస్టును తని ఖీ చేసిన ఆయన వచ్చిపోయే వాహనాలను పరిశీ లించారు. ఎన్నికల సిబ్బంది అప్రమ్తతంగా ఉం డాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించ వద్ద ని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కల్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా లో ఎన్నికల్లో విధుల్లో భాగంగా మైక్రో అబ్జర్వర్ల ప్రక్రియను పూర్తి చేశామని జనరల్ అబ్జర్వర్ రవిరంజాన్ కుమార్ విక్రమ్, జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైక్రో పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి స్కీన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మ ల్ జిల్లాలో 47, ముథోల్లో 50, ఖానాపూర్లో 58 నియోజకవర్గాల్లో మైక్రో అబ్జర్వర్లను నియ మించామని తెలిపారు. వీరికి త్వరలో శిక్షణ ఉం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, ఈడీఎం నదీం, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, తదితరులు పాల్గొన్నారు.