భైంసా, అక్టోబర్ 6 : సీఎం సహాయనిధి బడుగు, బలహీన వర్గాల అభాగ్యులకు అండగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో గురు వారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపి ణీ చేసి మాట్లాడారు. ఆపద సమయాల్లో వైద్యం కోసం సీఎం సహాయనిధి పేదలను ఆదుకుం టుందన్నారు. అనంతరం ఖాజా మోహినొద్దీన్కు రూ. 54 వేలు, అబ్దుల్ బషీర్కు రూ. 24 వేలు, ముష్కాన్ ఖానం రూ. 24 వేలు, షేక్ అసిఫా బేగం రూ. 28 వేలు, సయ్యద్ హుస్సేన్కు రూ. 14,500, కౌసర్ ఖానంకు రూ. 15 వేలు, షేక్ అలీకు రూ. 7 వేల చెక్కులను అందజేశారు.
కాగా పట్టణంలోని కస్తుర్బా పాఠశాల విద్యార్థిని మనీషా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కు ఎంపిక కావడంతో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విశ్రాంతి భవనంలో ఆమెను అభినందించారు. ఆయా చోట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, తోట రాము, ఆళా, రమేశ్ మాశెట్టివార్, గణేశ్ జాదవ్, మల్లన్న యాదవ్, లక్ష్మణ్ రావు, రామారావు, ఉత్తమ్, దత్తురాం పటేల్, తదితరులు ఉన్నారు.