మంచిర్యాల, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను తానే పెంచి పోషించానంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం ఛాంబర్లో గురువారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలయ్యాయి. ‘భట్టి, రేవంత్, నేను ఒకేసారి ఎమ్మెల్సీలు అయ్యాం. ఒకాయన ముఖ్యమంత్రి, మరొకాయన ఉపముఖ్యమంత్రి అయ్యారు. నేను మాత్రం ఛాంబర్ల చుట్టూ తిరుగుతున్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర మ్యాప్లో ఉండడం లేదు.
అప్పుడు కాంగ్రెస్ పాలనలోనే జిల్లాను పక్కనపెట్టారు. మళ్లీ ఇప్పుడు అలాగే జిల్లాను పక్కన పెట్టారు. మల్లికార్జున ఖర్గే మంచిర్యాల సభలో రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులిస్తామని ప్రకటించారు. దాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు.’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాట్సాప్లో చక్కర్లుకొట్టాయి. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నోటి దురుసు తగ్గలేదని, ఎంత మంత్రి పదవి దక్కకపోతే మాత్రం ఇలా మాట్లాడుతారా అంటూ జనం చర్చించుకుంటున్నారు.