భైంసా, నవంబర్ 2 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. ఇందుకు సంబంధించి బైపాస్ రోడ్డు సమీపంలో సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గం నుంచి దాదాపు 50 వేలకుపైగా జనం వస్తారనే అంచనాతో వేదికను తయారు చేశారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు రానుండగా.. స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమాయత్తమయ్యారు.
సభకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్యే విఠల్రెడ్డి మండలాలవారీగా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా.. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ నేడు(శుక్రవారం) భైంసా పట్టణంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కోరారు. గురువారం భైంసా పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు రానున్నారని, నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈయన వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళిగౌడ్, రమాదేవి, పిప్పెర కృష్ణ, తోట రాము, సంజీవ్రెడ్డి, రమేశ్ మాశెట్టి వార్, విలాస్ గాదేవార్ ఉన్నారు.