మంచిర్యాల, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నరు. అలాంటోళ్లు గెలిస్తే ఏం చేయకున్నా వేళకు సూట్కేసులు పట్టుకొని పోతే గెలుస్తమనే అభిప్రాయం వస్తది. మరి సూట్కేసులతో వచ్చే దోపిడీదారులు కావాల్నా.. జేబుల పైసలు లేకుండా వచ్చే సుమన్ లాంటి వ్యక్తి కావాల్నా.. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మంగళవారం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. సుమన్ తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడి జైళ్ల పాలైండు. ప్రజలు అవకాశమిస్తే ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిండు. ఈసారి సుమన్ను 50 వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. సుమన్ నా బిడ్డలాంటోడు.. రెండు పనులు చేస్తడు. ఇక్కడ చెన్నూర్లో మీ సేవ చేస్తడు. అక్కడ పార్టీ కోసం మా ఇంట్లనే ఉంటడు. ముఖ్యమంత్రి చెయ్యి కిందనే ఉంటడు కాబట్టి ఏ పని చెప్పినా ఆగకుండా నడుస్తదన్నారు. మంచి బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుందన్నారు.
సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరి సూట్కేసులతో వచ్చే దోపిడీదారులు కావాల్నా.. అభివృద్ధి చేసి వచ్చే సుమన్ కావాల్నా.. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చా రు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మంగళవా రం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాక కొట్లాడి జైళ్ల పాలై ప్రజలు అవకాశమిస్తే ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన నికార్సయిన సుమన్ లాంటి నాయకుడు కావాల్నా.. ఎన్నికలు వచ్చినయంటే నాలుగైదు పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వచ్చే నాయకుడు కావాల్నా.. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మీ ఆలోచన సరళిలో మార్పురానంత వరకు సూట్కేస్ గాళ్లు, నోట్ల కట్టల బాపతు గాళ్లు వస్తనే ఉంటరన్నారు. వాళ్ల బలమంతా డబ్బేనని, కానీ.. వాళ్లు ఎక్కడ కనిపించరని, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఉండరు, సం పతి వచ్చినప్పుడు ఉండరు, దుఃఖం వచ్చినప్పుడు ఉండరు.. ఎలక్షన్లు వచ్చినయంటే మాత్రమే వస్త రు.
ఎన్నికలు వచ్చినయంటేనే వీళ్ల కడుపుల నుంచి ప్రేమలు దేవుకవస్తాయన్నారు. ‘మల్లయ్య మల్ల య్య ఇగ రా బిడ్డా.. రెండు సీసలు తాగుదాం రా బిడ్డ అని వస్తరు. నీ ఇంట్లేమన్న లగ్గముందా.. కా ర్యముందా.. ఎందుకిస్తరు సీసలు..? ఈ బాపతి గా ళ్లను తరిమి కొట్టకుంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, దానికి విలువ ఉండదన్నారు. ఈ జిల్లాలో ఇద్దరు, ముగ్గురు మోపయిండ్లు ఒకడైతే పగాతూ పేకాట క్లబ్ పెట్టి పైసలు సంపాయించిండు. మంది నెత్తులు కొట్టి, ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థంట మంచిర్యాల కాడ. వాడు ఇక్కడ ముంచి, అక్కడ ముంచి డబ్బులు తెచ్చి సీసాలు పంచి, అది పంచి గోల్మాల్ చేయాలని చూస్తుండ్రు. ఈ గోల్మాల్ గోవిందం గాళ్లను ప్రజలు గోల్మాల్ చేయనంత కాలం ఈ దరిద్రమే ఉంటదన్నారు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలన్నారు. అది ప్రజల శక్తి అని, మీ చేతిలోనే ఉంటుందని, మీరు కూర్చొని ఆలోచన చేయాలన్నారు. వాడు అచ్చి అడిగితే మెహమాటానికి ఆ అనాలె.. చేసేకాడ చేసే పని చేయాలన్నారు. సురుకు పెట్టేకాడ పెట్టాలని కోరారు. ఆ విధంగా దయచేసి మీరందరూ ఆలోచన చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తదన్నారు.
అంబేద్కర్ను ఓడించిందే కాంగ్రెస్ పార్టీ..
దళితులు అనేక సంవత్సరాల నుంచి వెనుకబడ్డ రు. యుగయుగాల నుంచి అణిచివేతకు గురైండ్రు. సామాజిక వివక్షకు గరైండ్రు. వాళ్లని ఎవ్వరు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 75 ఏండ్ల కిందటనే దళితుల గురించి స్పెషల్ గ్రోత్ ఇంజన్ పెట్టి దళితజాతి అభివృద్ధి గురించి ఆలోచిస్తే దళితుల జీవితాలు బాగు పడకపోవునా ఆలోచించాలన్నారు. దళితులకు అ మ్మ పేరు చెప్పి, బొమ్మ పేరు చెప్పి ఓటు బ్యాంక్ లెక్కవాడుకున్నరు తప్ప దళితులకు ఏనాడు ఏమి చేయలేదన్నారు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్ర భుత్వం భారతదేశంలోనే పెద్ద పొలికేక దళితబంధు కార్యక్రమం తీసుకువచ్చిందన్నారు. ఈ దళితబం ధు కచ్చితంగా ప్రతి కుటుంబానికి అందేవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తదన్నారు. ఈ దళితబంధు కార్యక్రమాన్ని కాంగ్రెస్ 75 ఏండ్ల కిందనే మొదలుపెట్టి ఉంటే ఇవాళ మన దరిద్రం పోకపోవునా.. దళితబంధు వచ్చిన పిల్లలు ఎంతబాగ పని చేస్తున్నరు. ఎంతబాగ బతుకుతున్నరు. అదే కొనసాగించాలన్నారు. అంబేద్కర్ మహాశయుడు అనేక పోరాటాలు చేసిండు. ఆయనను కూ డా పార్లమెంట్ ఎలక్షన్లో ఓడగొట్టింది ఈ కాం గ్రెస్ పార్టీనే కదా. మీరు తెలుసుకోండి చరిత్ర.. నే ను సుమన్కు చెప్త. కావాలంటే ఆ బుక్కులు తెచ్చి ఇక్కడ పంచుకోవాలన్నారు. అంబేద్కర్ను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టి ఆయన చెప్పిన సిద్ధాంతాలను అమలు చేయలేదన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామన్నారు. ఒక నిబద్ధత, పద్ధతితో తెలంగాణలో ఒకటొకటి చేసుకుంటూ పోతున్నామన్నారు.
గెలిచిన పది రోజుల్లో పెర్క్ ట్యాక్స్ ఇప్పిస్తా..
బాల్క సుమన్ సింగరేణి కార్మికుల కోసం ఒక నాలుగైదు విషయాలు చెప్పారన్నారు. ఒకటి రిటైరైన కార్మికులకు ఇండ్లు వాళ్లకే ఇయ్యాలే.. ఏదో ఒక ధర కట్టి ఇవ్వాలే వాళ్లకు లాభం జరుగుతుందన్నారు. సింగరేణిలో పెర్క్ట్యాక్స్ కోల్ ఇండియాలో రియింబర్స్మెంట్ ఇస్తున్నారని చెప్పారని, అక్కడ ఇచ్చేది నిజమైతే ఎలక్షనైనా పది రోజుల్లో మీకు కూడా నేను ఇప్పిస్తానన్నారు. అది మన చేతిలో పని అని, ఇక్కడ కూడా మీకు ఈజీగా ఇప్పిస్తామన్నారు. ఇంకా రెండు సమస్యలు చెప్పిండు, వాటిని కూడా సానుభూతికి పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. మందమర్రిలో డిగ్రీ కళాశాల కావాలని సుమన్ కోరారని, మీరు సుమన్ను 50 వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి, మీకు డిగ్రీ కాలేజీ తెప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
సుమన్ నా బిడ్డలాంటోడు..
సుమన్ రెండు కార్యక్రమాలను చేస్తడని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమంలో ఉద్యమం చేసిం డు.. జైలుకు పోయిండు.. తెలంగాణ తెచ్చేదాక కొ ట్లాడిండు.. ఎంపీ అయిండు. మల్లా ఎమ్మెల్యే అ యిండు. సుమన్ రాక ముందు చెన్నూరు ఎలా ఉండే, సుమన్ వచ్చాక ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని కోరారు. చెన్నూర్ నియోజకవర్గంలో అ నేక గ్రామాలకు వర్షాకాలంలో వరదలు వస్తే సం బంధాలే తెగిపోయేవన్నారు. ఇవాళ సుమన్ 22 బ్రిడ్జిలు కట్టించిండు. ఇంకో 20 బ్రిడ్జిలు కట్టిస్తున్నాడన్నారు. రోడ్లయినయ్. అనేక సదుపాయాలు అ యినయ్. సెంట్రల్ లైటింగ్ అయింది. మంచినీటి సదుపాయం వచ్చింది. నేనిప్పుడే బస్సులో వ స్తుంటే సుమన్ నాకు చూపించారు. ఇది ఐటీఐ బి ల్డింగు, ఇది పాలనా బిల్డింగు.. దీన్ని మన మే క ట్టినం అని చూపించుకుంటూ వచ్చారన్నారు. తపనతోని తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి కాబ ట్టి, నేనున్న కానిస్టేన్సిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనే తండ్లడుతాండన్నారు. రెండు పను లు చేస్తడు సుమన్. ఇక్కడ చెన్నూర్లో మీ సేవలు చేస్త డు. అక్కడ పార్టీ కోసం మా ఇంట్లనే ఉంటడు. నా బిడ్డలాంటోడని పోయిన సారే చెప్పిన.
హైదరాబాద్లో ఉంటే సగం టైం నా ఇంట్లోనే ఉంటడన్నారు. అలాంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం చేకూరుతుంద ని, ముఖ్యమంత్రి చెయ్యి కిందనే ఉంటడు కాబట్టి ఏ పని చెప్పినా ఆగకుండా నడుస్తదన్నారు. మంచి బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుందన్నారు. పార్టీ లు మార్చి సూట్కేస్లు పట్టుకొని వచ్చేటోళ్లు గెలిస్తే మేం ఏం చేయకున్నా వేలకు సూట్కేస్లు పట్టుకొ ని పోతె గెలుస్తమనే అభిప్రాయం వస్తుదన్నారు. అందుకే ఈ సూట్కేస్ గాళ్లు కావాల్నా.. బాల్క సు మన్ కావాల్నా.. దయచేసి ఆలోచించాలన్నారు. ఇ ది చైతన్యవంతమైన ప్రాంతమని, కా ర్మిక లోకం ఉన్న ప్రాంతమని, ఉద్యమాలు జరిగిన ప్రాంతమ ని, చైతన్యవంతంగా ఆలోచించి సుమన్ను దీవించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలి. బీఆర్ఎ స్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మె ల్యే అభ్యర్థులు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఎ మ్మెల్సీలు దండే విఠల్, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పూస్కూరి రాం మోహన్రావు, మాజీ మంత్రి బోడ జనార్దన్ పాల్గొన్నారు.