పెంచికల్పేట్, ఏప్రిల్ 15 : నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని టాస్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ అన్నారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి ఏల్లూరు గ్రామానికి చెందిన ఎండీ ముబాషీర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 15 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డట్లు తెలిపారు.
సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని, పట్టుబడ్డ బియ్యాన్ని స్థానిక పోలీస్స్టేషన్లో అందించామన్నారు. ఆయన మాట్లాడుతూ జటా.. మటా, కోడిపందేలు, కలప రవాణా, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది మధు, రమేశ్, సంజీవ్ ఉన్నారు.