ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న అర్చకుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పెంచుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో రూ. 2,500 రాగా.. వీటిని సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారు. రెండో దఫా మూడు నెలల క్రితం రూ.10 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రూ.10 వేలలో రూ.4 వేలు పూజ, నైవేద్యానికి.. రూ.6 వేలు అర్చకుల గౌరవ వేతనం కింద ఖాతాలో వేయనున్నారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 624 మందికి ప్రయోజనం చేకూరుతోంది. ఇందులో నిర్మల్ జిల్లాలో 265, ఆదిలాబాద్లో 135, కుమ్ర భీం ఆసిఫాబాద్లో 64, మంచిర్యాల జిల్లాలో 160 మంది లబ్ధి పొందనున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. దేవాదాయ శాఖ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఉమ్మడి పాలనలో అర్చకులకు గౌరవ వేతనం రూ.2500 మాత్రమే ఉండే. సీఎం కేసీఆర్ అర్చకుల ఇబ్బందులను గుర్తించి రూ. 6 వేలకు పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ. 10 వేలు చేశారు. 6,541 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నాం. యేడాదికి రూ.78.49 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి
ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న అర్చకుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పెంచుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో రూ. 2,500 రాగా.. వీటిని సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారు. రెండో దఫా మూడు నెలల క్రితం రూ.10 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 వేలలో రూ.4 వేలు పూజ, నైవేద్యానికి.. రూ.6 వేలు అర్చకుల గౌరవ వేతనం కింద ఖాతాల్లో వేయనున్నారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 624 మందికి ప్రయోజనం చేకూరుతోంది. ఇందులో నిర్మల్ జిల్లాలో 265, ఆదిలాబాద్లో 135, కుమ్ర భీం ఆసిఫాబాద్లో 64, మంచిర్యాల జిల్లాలో 160 మంది లబ్ధి పొందనున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)
నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : నిర్మల్ పట్టణంలోని దత్తాత్రేయ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నా. ఇటీవలే మా ఆలయం ధూప దీప నైవేద్యం కింద ఎంపికైంది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ అర్చకులను ఆదుకుంటున్నారు. ఆయనకు బ్రాహ్మణ సమాజం ఎప్పటికీ అండగా నిలుస్తుంది. ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన సల్లంగుండాలి.
– రాధేశ్యాం శాస్త్రి, నిర్మల్
నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : నేను 30 ఏండ్ల నుంచి అర్చకునిగా పని నిర్వహిస్తున్నా. రూ.500 గౌరవ వేతనం నుంచి పని చేస్తూ వస్తున్నా. ఎందరో ముఖ్యమంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు మారినా మా బాధ తీరలేదు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా కావడం వల్లే మాకు మేలు జరిగింది 2014కు ముందు రూ. 2500 నుంచి రూ.6000కు పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలకు పెంచారు. ఇది గొప్ప విషయం. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ చొరవతో మా బాధ తీరింది.
– రామానుజాచార్యులు, అర్చకుడు, నిర్మల్
నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అర్చకుల గౌరవ వేతనం రూ.10 వేలకు పెరిగింది. ఇది బ్రాహ్మణులు గర్వించదగ్గ రోజు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెడుతూ పేదలకు అండగా నిలుస్తున్నారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయంటే ఆ గౌరవం సీఎం కేసీఆర్, ఐకేఆర్లకే దక్కుతుంది.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : అర్చకుల సమాఖ్య భవనం ప్రారంభోత్సవ సమయంలో అర్చకులకు రూ.6 వేల నుంచి రూ. 10 వేల వరకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రూ.10 వేల గౌరవ వేతనం రావాలంటే ఎన్ని రోజులు పడుతుందోనని అనుకున్నాం. కానీ, ప్రకటించిన రెండు నెలల్లోనే అమలు చేశారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారు.
– జంగం మహేశ్, అర్చకుడు, గుండంపల్లి
ప్రభుత్వం ఆలయాలకు ఇస్తున్న ధూప దీప నైవేద్య పథకం డబ్బులు, అర్చకుల గౌరవ భృతిని పెంచినందుకు ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయడం గొప్ప విషయం. ప్రభుత్వ నిర్ణయంతో ధర్మపరిరక్షణ జరుగుతోంది. నిత్యం ఆలయాల్లో పూజలు, దేవతలకు నైవేద్యాల సమర్పణ సక్రమంగా జరుగుతోంది. ఆలయాలకు ఇంతకాలం ఇచ్చే పథకం ద్వారానే ఆలయ నిర్వహణతోపాటు మా గౌరవ వేతనం అందుతోంది. ప్రభుత్వం మాకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 6 వేలకు పెంచింది. ఈ సర్కారు పది కాలాల పాటు వర్ధిల్లాలి.
– ఒజ్జల శిరీష్ శర్మ, కెస్లాపూర్ హనుమాన్ టెంపుల్, ఆసిఫాబాద్
తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. సీఎం కేసీఆర్ పదేళ్ల కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది. హిందూ ధర్మ రక్షణతోపాటు పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయం. ప్రభుత్వం అర్చకులకు వేతనాలు పెంచడం గొప్ప విషయం. పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకున్నట్లయింది. అదేవిధంగా వేద పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతోంది. వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. నిజమైన ధార్మిక వేత్త సీఎం కేసీఆరే.
– దిలి విజయ్కుమార్, అర్చకుడు, ఆసిఫాబాద్
తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఈ ప్రాంతంలోని ఆలయాలు నిరాదరణ గురయ్యాయి. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ధూప దీప నైవేద్య పథకం ద్వారా ఆలయాల్లో నిత్య పూజలు జరిగేలా కృషి చేస్తున్నారు. జిల్లాలోని 64 ఆలయాలకు ఈ పథకం వర్తిస్తోంది. ఇంకా మరిన్ని ఆలయాలకు ఈ పథకం విస్తరించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ధూప దీప నైవేద్య పథకాన్ని రూ.10 వేలకు పెంచడం గొప్ప నిర్ణయం. దైవ చింతన పెరుగనుంది. ధర్మాన్ని కాపాడుతే.. ఆ ధర్మమే మనలను కాపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లవేళలా ధర్మం అండగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం పచ్చగా, సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.
– అభయ్ ఆచార్య, అర్చకుడు, ఆసిఫాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు. బ్రాహ్మణ సదన్ నిర్మాణం ద్వారా తెలంగాణలో సరికొత్త విధానాన్ని లిఖించారు. ధర్మ పరిరక్షణకు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని గొప్పలు చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్లాగా గొప్ప పనులు చేసినోళ్లు లేరు. ధర్మ రక్షణ, బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. తెలంగాణ ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ వంటివి చేపడుతున్నారు. ధర్మాన్ని రక్షించే వారికి దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.
– వారణాసి మురళి, అర్చకుడు, ఆసిఫాబాద్