నార్నూర్, జనవరి 20 : చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్ వాడీల ద్వారా బాలామృతాన్ని అందిస్తున్నది. ప్రభుత్వం మరిన్ని అధిక పోషకగుణాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బాలామృతం ప్లస్ను ప్రవేశపెట్టింది. నార్నూర్, గాదిగూడ ఉమ్మడి మండలాల్లో 48గ్రామ పంచా యతీలు ఉన్నాయి. ఇందులో 154అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 103 మెన్, 51మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఏడునెలల నుంచి 3 ఏళ్ల వరకు 3,176మంది చిన్నారులు, మూడేళ్ల నుంచి 6 ఏళ్ల వరకు 2,913 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు1,096 మంది ఉన్నారు.
చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ..
అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్యస్థితిని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. ముఖ్యంగా వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా పరిశీ లిస్తున్నారు. ఈ రికార్డుల ఆధారంగా చిన్నారులు తీవ్ర పోషకలోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతోపాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేశాఖతో పాటు టీఎస్ ఫుడ్స్,యూనిసెఫ్ అధికారులు ప్రత్యేకంగా బాలామృతం ప్లస్ను అందుబాటులోకి తెచ్చారు.
బాలామృతం ప్లస్లో ఇవీ..
పాలపొడి, పల్లినూనె, రైస్, గోధుమలు, శనగపప్పు, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలతో తయారు చేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజే సేందుకు మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
ఇష్టంగా తింటున్నారు..
ప్రభుత్వం కొత్తగా సరఫరా చేస్తున్న బాలామృతం ప్లస్ను చిన్నారులు ఇష్టంగా తింటున్నారు. చిన్నారుల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. చిన్నారులకు బాలా మృతం మంచి నిర్ణయం తీసుకుంది.
అవగాహన కల్పిస్తున్నాం..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బాలామృతం ప్లస్తో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాం. పుట్టిన పిల్లలతో పాటు తల్లుల శక్తి, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ విటమిన్ ఏ,బీ,సీ బాలామృతంలో లభిస్తా యి. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.