దస్తురాబాద్, ఏప్రిల్ 24 : మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయాన్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడమ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనాల పండుగ, పట్నాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంటింటికీ బోనం తీసి మహిళలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు, ఒడి బియ్యం సమర్చించి మొక్కులు తీర్చుకున్నారు.
పరుశు రాం బృందం ఒగ్గు కళాకారులు చేసిన విన్యాసా లు ఆకట్టుకున్నాయి. మొక్కులో భాగంగా మేక లు, కోళ్లను బలిచ్చారు.ఈ కార్యక్రమంలో యా దవ సంఘం మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, గ్రామాధ్యక్షుడు ఎక్కలదేవి మహేశ్, సంఘం నాయకులు ముడికే శ్రీనివాస్, గడ్డం కు మార్, ఎక్కలదేవి కొమురెళ్లి, బాలయ్య, మానుక నరేశ్, గడ్డం గంగన్న, పుల్లె గట్టు, సంఘం పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.