ఆదిలాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మకానికి పెట్టి కార్మికులు, ఉద్యోగుల ఉపాధి కొల్లగొడుతుందని విమర్శించారు.
సీసీఐ ని ప్రారంభించాలని మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీసీ సందర్శించిన బీజేపీ కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమలు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.