ఆదిలాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు శనివారం ప్రారంభమయ్యాయి. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం కజ్జర్లలో మొదటి సమ్మేళనం ఆరంభమైం ది. ఈ కార్యక్రమానికి జిల్లా కో- ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజవర్గంలో బీఆర్ఎస్కు 40 వేల సభ్యత్వం ఉందని, ఆత్మీ య సమ్మేళనాలకు క్రీయశీల, సాధారణ కార్యకర్తలందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తు న్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, రాష్ట్రంలో ఆ పార్టీలకు స్థానం లేదన్నారు. ప్రధా ని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించినా రాష్ర్టాభివృద్ధిపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ర్టాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ పేరిట వేధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మూడోసారి రాష్ట్రం లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు.
తొమ్మిదేండ్లలో గణనీయమైన అభివృద్ధి : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా బోథ్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివాసీ గూడేలు, తండాలకు రవాణా, తాగు, సాగునీరు, విద్యుత్, వైద్యం, ఇతర సౌకర్యాలు మెరుగు పడినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబా రక్, పింఛన్లు, అమ్మఒడి, కేసీఆర్ కిట్తో పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతంలో ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లేవారని.. కులవృ త్తులు, వ్యవసాయ పథకాల ఫలితంగా వారి ఉపాధి మెరు గు పడి వలసల నివారణ జరిగిందన్నారు. బీజేపీ నాయ కులు కులాలు, మతాల పేరిట ప్రజలను మభ్యపెడుతు న్నారన్నారు. ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ యాత్రలను ప్రజలు పట్టించుకోలేదన్నారు.
బీజేపీ వైఫల్యాలు తెలుపాలి : అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్.
కేంద్రంలోని బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మోదీ నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి పేదల బ్యాం కు ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు జమ చేస్తామనడం.. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు దేవారెడ్డి, అధికార ప్రతినిధి కిరణ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు లోక జీవన్రెడ్డి, నాయకులు వెల్మ శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి, ప్రశాంత్, రాంబాయి, కంది నర్సింహులు, ఆనంద్, శాస్త్రి, కృష్ణన్న, అబ్దుల్ల, ప్రకాశ్, గజానంద్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.