దస్తురాబాద్, మార్చి 24: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నా రు. ఖానాపూర్ నియోజకవర్గంలోనే మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని దస్తురాబాద్లోని రైతు వేది క వద్ద పార్టీ మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని, అందుకు అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించా రు. పార్టీ, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, పథకాలు, కష్ట, సుఖాలను చర్చించుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో వచ్చిన మార్పు, పథకాల అ మలుపై గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఏ పథకమూ ఇతర రాష్ర్టాల్లో అమలు కావడం లేదని పే ర్కొన్నారు. తెలంగాణ తరహా పాలన కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పా రు.మన రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకమన్నా బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. వచ్చే నెల 14న హైదరాబాద్లో సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దస్తురాబాద్ మండలం ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువైందని చెప్పారు. జడ్పీటీసీ శారద, ఎంపీపీ కిషన్, వైస్ ఎంపీపీ రాజు నాయక్, సర్పంచ్ రాజమణి, ఎంపీటీసీలు మాన్కు, సుజాత, తదితరులు పాల్గొన్నారు.