కాసిపేట, ఏప్రిల్ 15 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ కోరారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంతో పాటు ముత్యంపల్లిలో విస్త్రత ప్రచారం నిర్వహించారు. షాపింగ్ కాంప్లెక్స్లలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మోజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వం బలపరిచిన కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ యువ నాయకులు సంజీవ్, రమేశ్, ప్రశాంత్, సాగర్, కిషోర్, రవి, అరుణ్, ప్రసాద్, సుమంత్ పాల్గొన్నారు.