గుడిహత్నూర్, నవంబర్ 17 : నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్, తోయగూడ, తోషం, తోషంతండా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జాదవ్ అనిల్ ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరువద్దన్నారు. ఎన్నికల సమయంలో అధికారం, పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి సీఎంగా కేసీఆర్ను చేద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు జీ తిరుమల్గౌడ్, కుమ్రం శంభు, సింధే మీనా, జిల్లా, మండల నాయకులు సర్పే సోంబాయి, ఆడె శీల, రాము, తెలంగె మాధవ్, వెంకట్రావ్, ఎండీ గఫార్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 17 : మండలంలోని కన్గుట్ట గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టో గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను గుర్తించి వారిని గౌరవించి వయసుతో నిమిత్తం లేకుండా రూ.2016 నగదు ఇచ్చి ఆర్థిక భరోసాను కలిగిస్తుందని అన్నారు. భవిష్యత్లో మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ రమేశ్, అల్లకొండ ప్రశాంత్, జుగాదిరావ్, విజయ్ పాల్గొన్నారు.
తాంసి, నవంబర్ 17 : పేదలపై మోదీ సర్కారు మోపిన బండ భారాన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాక రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు అన్నారు. శుక్రవారం మండలంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.
కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్న, సదానందం, బీఆర్ఎస్ నాయకులు కాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ ధనుంజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), నవంబర్ 17 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నదని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. శుక్రవారం సిరికొండ మండలంలోని గోధుమల్లే, నేరడిగొండ(జీ), నారాయణపూర్, ఫకీర్పేట్, రాజులగూడ గ్రామాల్లో ఇంటింటికీ బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్ రూ.2016 నుంచి రూ.5016 వరకు పెంచారని తెలిపారు.
దివ్యాంగులకు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిరికొండ బీఆర్ఎస్ నాయకులు ఓరగంటి పెంటన్న, ఎండీ ఎక్బల్, తోకల చందు, సంతోష్, లక్ష్మణ్, భూమన్న, తులసీరాం, కన్నయ్య, గంగాధర్, కృష్ణకుమార్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.