చెన్నూర్/మందమర్రి, ఏప్రిల్ 22 : చెన్నూర్ నియోజకవర్గంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు మం దమర్రి డివిజన్లోని కేకే-5 బొగ్గుగనిని సందర్శించనున్నారు. 8 గంటలకు పాల చెట్టు ఏరియాలోని శ్రీపంచముఖీ హనుమాన్ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహిస్తారు.
ఉద యం 9 గంటలకు యాపల్ ఏరియాలో ప్రచా రం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్ నివాసం వద్ద నియోజవర్గ స్థాయి యు వజన, విద్యార్థి, సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు చెన్నూర్ పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిలో ఎన్నికల ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్ తెలిపారు.