కుంటాల, అక్టోబర్ 28 : కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక దుస్థితే ఎదురవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ. విఠల్ రెడ్డి శనివారం మరోసారి కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పెంచికల్పాడ్ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను, పదేళ్లకాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద లబ్ధి అందుతున్నదని మరోసారి కారు గుర్తు కు ఓటేయ్యాలని కోరారు.
కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. మ్యానిఫె స్టోలో పొందుపరిచిన రైతుబంధు పెంపు, ఆసరా పింఛన్ల పెంపు, రూ. 400ల కే వంట గ్యాస్, సౌ భాగ్య లక్ష్మీ పథకంలో భాగంగా బీపీఎల్ కుటుంబాల మహిళలకు నెలకు రూ. 3 వేలు గౌరవ భృతి, రేషన్ కార్డుపై సన్నబియ్యం, కుటుంబానికి రూ. 5 లక్షల బీమా, కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో అర్హులైన పౌరులందరికి, రూ. 15 లక్షల ఆరోగ్య శ్రీ బీమా తదితర పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ గడపగడపకూ తిరిగారు. గ్రామంలోని పలువురు దివ్యాంగులను కలిసి ఓటును అభ్యర్థించారు. పార్టీ అధికారంలోకి వస్తే వారికి పెరిగే పెన్షన్ గురించి వివరించారు. కాంగ్రెస్ యొక్క ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టో వట్టి నీట మూటని ,ప్రలోభాలకు లోనుకావద్దని కోరారు.
బీజేపీ అసత్య ప్రచారాలకు యువత మోసపోవద్దని అన్నారు. కుంటాల జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, దేవాలయాలకు అభివృద్ధి కార్యక్రమా లు ఎన్నో చేశారని, అలాగే పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైతే ముఖ్యమంత్రి సహాయనిధి ఇప్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. విఠాపూర్, వెంకూర్లో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. విఠాపూర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, పార్టీ సోషల్ మీడియా జిల్లా అథ్యక్షుడు దశరథ్, పాక్స్ చైర్మన్ గజ్జారాం, రైతు బంధు సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖదీర్, నర్సాపూర్ (జి) మండల కన్వీనర్ పాపెన్ రాజేశ్వర్, ఆత్మ మాజీ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, భారత జాగృతి మండలాధ్యక్షుడు బోగ లక్ష్మణ్, విఠాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీరమేశ్, పెంచికల్పాడ్ ఉప సర్పంచ్ గుద్దేటి కిష్టయ్య, సీనియర్ నా యకులు విలాస్ గాదేవార్, చంద్రకాంత్ రమణ గౌడ్, హైమద్ పాషా, దొనికెన వెంకటేశ్, అహ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొంతల పోశెట్టి, గైని సాయికుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పెద్దింటి ఇంద్రా రెడ్డి, రమేశ్, ఉమ్రిశ్రీధర్, శివకుమార్, సబ్బిడి గజేందర్, రాకేశ్, శ్రీకర్ రెడ్డి, గొనె గజ్జా రాం, గోపీ గౌడ్, పురుషోత్తం, రజనీకాంత్, సుదర్శన్ రెడ్డి, సంతోష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్న పర్యటించిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీ. విఠల్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. విఠాపూర్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెంచికల్పాడ్లో గంగారెడ్డి గడ్డం, జై కిషన్ సీతారాం పటేల్, గంగాధర్, సృజన్, రాకేశ్, నరేశ్, రమేశ్, లస్మన్న, సాయి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాకాయ లు పేల్చి సంబరాలు చేసుకున్నారు.