నిర్మల్ అర్బన్, డిసెంబర్ 12 : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావును మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి -విజయలక్ష్మి దంపతులు పరామర్శించారు. హైదరాబాద్లోని సోమాజీగూడలోని యశోద దవాఖానకు వెళ్లి చంద్రశేఖర్రావును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ను పరామర్శించిన జాన్సన్ నాయక్
హైదరాబాద్లోని సోమాజీగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై తెలుసుకున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ విప్ బాల్క సుమన్, సినీ నటుడు చిరంజీవితో కలిసి కేసీఆర్ ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్ దవాఖానలోనే కేటీఆర్తో కలిసి ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు.