నిర్మల్ అర్బన్ : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి అభ్యర్థులు వెళ్తున్నారు. కారు గుర్తుకు ఓటేసి, బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తున్నారు. ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, మరోసారి ఆయనను గెలిపించుకుందామని పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బొట్టుపెట్టి, మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. ర్యాలీల్లో నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సోమవారం కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల, జైనథ్ మండలాల్లో అభ్యర్థి జోగు రామన్న, తాంసి, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లో బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ , నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
విజయతిలకం : జైనథ్: లేకర్ వాడలో ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు తిలకం దిద్దుతున్న మహిళలు
అయ్యా ఓటు నాకే..: నేరడిగొండ: తేజాపూర్లో శతాధిక వృద్ధుడిని ఓటు అభ్యర్థిస్తున్న బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్