నిర్మల్ అర్బన్, నవంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిర్మల్ నియోజకవర్గం ప్రగతి పథం లో వేగంగా దూసుకెళ్తున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మల్ ప్రగతిలో ముందు న్నది. నిర్మల్ జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించనున్నారు.
పలు అభివృద్ధి పనులు..
నిర్మల్లోని దివ్యనగర్ కాలనీలో రూ.166 కోట్ల నిధులతో మెడికల్ కళాశాల నిర్మాణం చేప ట్టారు. తరగతులు ప్రారంభమయ్యాయి. నియో జకవర్గంలో 3,761 రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు నిర్మల్లో 1460 పూర్తికాగా 600 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 465 ఇళ్లు పూర్తి కాగా, 144 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణానికి సుమారు రూ.106 కోట్లు వెచ్చించారు. 1092 ఇండ్లను అదనంగా నిర్మిం చనున్నారు.
నిర్మల్లో సుమారు రూ.48.83 కోట్ల వ్యయంతో 250 పడకల జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు చేపట్టారు. రూ. 166 కోట్ల వ్యయంతో ఈ పనులు పనులు కొనసాగుతున్నా యి. రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మల్ నియోజ కవర్గంలో మొత్తం 213 ఆవాసాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో బీఆర్ అంబేదర్ భవన్ను నిర్మించారు. పట్టణ శివారు చించోలి (బీ), గ్రామ శివారులో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఈద్గా నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని రూ.56 కోట్లవ్యయంతో నిర్మించచారు. 313 కిలో మీటర్ల మేర రహ దారు ల నిర్మాణం చేపట్టారు. దీనికి రూ.194 కోట్లు వెచ్చించారు. సోన్ మండలం బొప్పారం గ్రామం లో రూ.1160 కోట్ల వ్యయంతో 400 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నిర్మల్ నియో జకవర్గం లో రూ.2215 కోట్ల వ్యయంతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం వ్యయం రూ.1182.15 కోట్లు. 628 దేవాలయాల పున ర్ని ర్మాణం చేపట్టారు.
సీఎం సహాయ నిధి, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా 4,044 మంది లబ్ధ్దిదారులకు రూ.17.65 కోట్లు చెల్లించారు. ఖనిజా సంక్షేమ నిధి నుంచి విద్య, వైద్యం, సిల్ డెవలప్మెంట్ గ్రామీణ రోడ్ల కోసం 2.20 కోట్లు ఖర్చు చేశారు. మహిళా సంఘాల్లోని 73 సభ్యులు ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.171.09 లక్షల సాయం అందించారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా 2,218 స్వయం సహాయక సంఘాలకు రూ.133.95 కోట్లు, మెప్మా ద్వారా 5,539 సం ఘాలకు రూ.42.87 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 5,039 సంఘాలకు రూ.37.81 కోట్లు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో రూ.2.66 కోట్లతో మసీదుల అభివృద్ధి పనులు చేపట్టాం. అన్ని ప్రధాన రహదారుల్లో సుమారు రూ.5.18 కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
మరింత అభివృద్ధి చేస్తా..
సీఎం కేసీఆర్ సార థ్యంలో వేగంగా నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. కేవలం అభివృద్ధే ఎజెం డాగా ముందుకు వెళ్తున్నా. కండ్ల ముం దు జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. వేల కోట్ల నిధులతో నియో జక వర్గాన్ని అభివృద్ధ్ది చేశాం. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరుస్తా. ప్రజలందరూ బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. నిరుద్యో గులందరికీ ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రజలు మళ్లీ నన్నే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
– అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి