భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి మూడు నుంచి నాలుగు పథకాలతో లబ్ధి చేకూరేలా ప్రణాళిక తయారు చేశారు. అర్హులైన మహిళలకు గౌరవ భృతి, మహిళా సంఘాలకు భవనాలు, పేదలకు ఇండ్ల స్థలాలు, గిరిజనేతరులకు పోడు పట్టాలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలుపై అధ్యయన కమిటీ వంటి వాటితోపాటు చెప్పుకుంటూ పోతే అనేకం మేలు జరిగే పథకాలే ఉన్నాయి. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఎవరికీ ఏం కావాలో తెలుసుకొని మ్యానిఫెస్టో తయారు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా.. ప్రకటనలపై సబ్బండ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటివరకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని ప్రకటించడం శుభపరిణామం. దీనివల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరుగుతది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతున్నది. మౌలిక సదుపాయాలు కూడా చాలా వరకు బాగు పడ్డాయి. ఇటీవలే నిర్మల్లో మెడికల్ కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయం. ఇక్కడి కాలేజీలో కూడా మౌలిక సదుపాయాలను కల్పించాలి.
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మ్యానిఫెస్టోను ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, అందరి బాగోగులను లెక్కలోకి తీసుకొని అద్భుతమైన ఎన్నికల హామీలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచ డం, దాన్ని పేదలకు పంచడమే ముందు నుంచి తమ విధానమన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ప్రస్తు తం ఉన్న పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా” పేరిట తెల్ల రేషన్ కార్డు ఉ న్న దాదాపు 93 లక్షల పేద కుటుంబాలకు ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా, అన్నపూర్ణ పేరిట రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఏప్రిల్, మే నెలల నుంచి సన్న బియ్యం, ఆసరా పింఛన్లు రానున్న ఐదేళ్లలో రూ.5 వేలు, దివ్యాంగుల పింఛ న్లు రూ.6 వేలకు పెంపు, వ్యవసాయ స్థిరీకరణ యథావిధిగా కొనసాగించేందుకు రానున్న ఐదేళ్లలో రైతుబంధు రూ.16 వేలకు పెంపు, సౌభాగ్యలక్ష్మి కార్యక్రమం కింద అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి, పేద మహిళలకు, అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కు గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ వర్తింపు రూ.15 లక్షలకు పెంపు వంటివి జర్నలిస్టులకు వర్తింపు, హైదరాబాద్లో మరొక లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్, మహిళ స్వశక్తి గ్రూప్లకు దశలవారీగా పక్కా బిల్డింగ్లు, అనాథ పిల్ల ల కోసం ప్రత్యేక పాలసీ, అసైన్డ్ ల్యాండ్స్పై ఆంక్షలు ఎత్తివే సి పట్టాదారు హక్కుల కల్పన, గిరిజనేతరులకు పోడు ప ట్టాలు, సీపీఎస్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులను ఓపీఎస్కు మార్చడానికి అధ్యయన కమిటీ ఏర్పాటు మొదలైన అంశాలన్నీ మ్యానిఫెస్టోలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఎవరికీ ఏం కావాలో తెలుసుకొని బీఆర్ఎస్ హామీలు ఇచ్చిందంటున్నారు.
దిలావర్పూర్, అక్టోబర్ 15: సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో చాలా బాగుంది. కేసీఆర్ సారు మాటిచ్చిండంటే కట్టుబడి ఉంటడు. ఆయన ఆలోచనంతా పేదోళ్ల గురించే ఉంటది. ఇప్పుడు ప్రకటించిన కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమాగా మారబోతున్నది. ఇక మహిళల కోసం సిలిండర్ రూ. 400కే ఇస్తమని చెప్పి, ఎంతో మేలు చేయబోతున్నరు. పింఛన్ కూడా విడుతల వారీగా పెంచుతమని అందరికీ సంతోషకరమైన విషయం చెప్పిండు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి మేమంతా తీసుకెళ్తాం. పార్టీ కార్యకర్తలుగా మాకైతే చాలా సంతోషంగా ఉంది.
భైంసా, అక్టోబర్ 15: ఇంట్లో మహిళలకు భృతి ఇస్తమని చెప్పడం మంచి ఆలోచన. పేదోళ్లకు, ప్రజలకు మంచి చెయ్యాలనే ఆయనకు ఆలోచన ఉంటది. గతంలో ఎంతో మందికి ఆయన మంచిజేసిండు. గిప్పుడు గదే చేస్తనంటున్నడు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ. 3వేల భృతి ఇస్తామనడం నాకైతే సంతోషంగా ఉంది. ఆయన మొదటి నుంచి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నరు. చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే ఇస్తున్నరు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సిలిండర్ కూడా రూ. 400 ఇస్తమన్నరు. ఇది కూడా పేద కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్లయితది.
దస్తురాబాద్, అక్టోబర్ 15: రైతు కష్టాన్ని అర్థం చేసుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. రైతులు పెట్టబడులకు ఇబ్బంది పడుతున్నరని రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చిండు. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేలు రైతు ఖాతాలో జమ చేస్తున్నది. నాకు ఐదెకరాల భూమి ఉంది. ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయం కింద రూ 50 వేలు నా ఖాతాలో జమ చేస్తున్నది. ఇగ రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం రూ 16 వేలకు పెంచుతమని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చెప్పిండు. గతంలో రైతులను పట్టించుకున్న సర్కారే లేదు. పెట్టుబడులకు అప్పులు చెయ్యకుండా ప్రభుత్వమే ఇంత మంచి సాయం చేస్తున్నది. చేతికొచ్చిన పంటను కూడా సర్కారే కొంటున్నది. గిప్పుడు కూడా పార్టీ మ్యానిఫెస్టోలో రైతులకు వరాలు ప్రకటించిండు. గిట్ల ఎవ్వలూ చెప్పలే.
ఇచ్చోడ, అక్టోబర్ 15: గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఏండ్ల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు, ప్రజలు వ్యవసాయ భూములను సాగు చేస్తున్నరు. అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో చాలా ఇబ్బంది పడే వాళ్లం. మా భూములను వారసత్వంగా ఇవ్వడమే గాని అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములపై ఆకాంక్షలను తొలగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా బాగుంది. దీనిపై గిరిజనేతర రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు.
కుంటాల, అక్టోబర్, 15: నేనుఏ తొమ్మిదేళ్ల సంది వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న. ఇప్పుడు మళ్లీ పింఛన్ పెంచుతమని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్డడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మాత్రమే పేదోళ్లకు అండగా ఉంటడు. నాకు కొంత భూమి కూడా ఉంది. దానికి రైతు బంధు వస్తున్నది. ఇప్పుడు రైతు బంధు కూడా పెంచుతమని ఆయన ప్రకటించిండు. కేసీఆర్ సారు మాట్లాడుతుంటే టీవీల చూసిన. మంచిగ చెప్పిండు. పేదోళ్లకు మంచి జేస్తనని హామీ ఇచ్చిండు. ఇప్పటిదాకా చేస్తున్న సాయాన్ని పెంచుతనని గట్టిగ చెప్పిండు. ఇగ ఆయనంటే ఎైట్లెనా చేస్తడు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడున్న మంచి పనులన్నీ కొనసాగిస్తనని చెప్పిండు. పేదోళ్లకు గింతకన్న మంచిగ చేసే లీడరును నా జన్మల సూడలె. ఆయన సల్లంగుండాలె.
సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినటువంటి సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు ఎంతో మేలు చేకూరనుంది. గ్రామీణ ప్రాంతాల మహిళలతో పాటు నిరుపేద మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతినెలా రూ. 3 వేలు అందించనున్నట్లు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. గత తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధితో పాటు మహిళల సంక్షేమం కోసం ఆయన ఎంతో చేసిన్రు. వచ్చే ఎన్నికల్లో మహిళల మద్దతు సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయిలో అందుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో మహిళా సంఘాల భవనాలు నిర్మాణం చేపడుతా మని బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం అభినందనీయం. దీంతోమహిళా సంఘాలు మరింత బలోపేతమవుతాయి. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మహిళా సంఘాల పూర్తి మద్దతు ఉంటుంది. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
ఇచ్చోడ, అక్టోబర్ 15: ఇప్పటికే రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకుల పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళను బలోపేతం చేసింది. పేద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నది. మళ్లీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. సన్నబియ్యం పేదవాడికి కూడా అందించడం బాగుంది. ఆకలి తెలిసిన వ్యక్తి కేసీఆర్. పేదోళ్లకు మంచి జేసుడు ఆయనతోనే అయితది.
జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరిట రూ.15లక్షల వరకు అవకాశం కల్పించడం, రూ.400కే గ్యాస్ సిలిండర్ వర్తింపజేస్తామని ప్రకటించడం హర్షనీయం. ఇప్పటికే చాలా జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చొరవతో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు రానున్నాయి.