బోథ్, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బోథ్లో రూ .20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులకు భూమి పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను ప్రభుత్వం పీహెచ్సీలు, సబ్ సెంటర్ల భవనాలను నిర్మిస్తున్నదని చెప్పారు. సబ్సెంటర్లో అన్ని రకాల వైద్య సేవలు అందించేలా వెల్నెస్ సెంటర్లుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, సర్పంచ్ సురేందర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ ఎస్ రుక్మాణ్సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్రెడ్డి, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్ సలాం, ఎలుక రాజు, ఎం సుభాష్, జగన్మోహన్రెడ్డి, పోశెట్టి, సోమన్న, రమణాగౌడ్, శంకర్, ప్రవీణ్, రమేశ్, లక్ష్మణ్, బుచ్చన్న పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనాలసిస్ట్ నేలంటి మధు, జర్నలిస్టులు జూకంటి ప్రశాంత్, మల్లాడి క్రాంతి బృందం రచించిన ‘రాజకీయ వృత్తి..నాయకత్వం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు’ పుస్తకాన్ని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మెడిచెల్మ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆవిష్కరించారు.
ఇచ్చోడ, మే 28 : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలకేంద్రంలోని విఠలేశ్వర మందిరంలో నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైఠక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాపురావ్ హాజరై మాట్లాడారు. ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులను గౌవించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్ర మంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు వెంకటేశ్, దాసరి భాస్కర్, ప్రవీణ్, ప్రకాశ్, ముస్తఫా, సూర్యకాంత్, సుధాకర్, గైకాంబ్లే గణేశ్, మహేందర్ రెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.