ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 9 : తెలంగాణకు బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కనక తుకారాం, పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డొంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్ ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి టీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజలకు మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, టీఆర్ఎస్ బీసీ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి దేవ్పూజే మారుతి, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్టెహెరే, నాయకులు కదం మహేశ్, రాందాస్, రాంనివాస్, దేవేందర్, నగేశ్, హరిదాస్, శ్యామ్, బాల్సింగ్, సుంకట్రావ్, బాబుముండే, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 9: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ బాలాజీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్పీ రెడ్డి, నాయకులు రషీద్, సతీశ్, భూమన్న, ఆశన్న, నారాయణ, రమేశ్, స్వామి, ముందర్రావు, రవి, మనోహర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి 9 : మండల కేంద్రంలోని గాంధీచౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ సురేశ్, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, గంగాపూర్ సర్పంచ్ యుర్వేత రూప్దేవ్, మండల కార్యదర్శి సయ్యద్ఖాసీం, టౌన్ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మహేందర్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నాయకులు కనక ప్రభాకర్, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.