ఇంద్రవెల్లి, డిసెంబర్ 9 : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మండల నాయకులు గురువారం బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఎంపీపీ శోభాబాయి, ఆదివాసీ గిరిజన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీంరావ్, ఎంపీటీసీ విజయ్సింగ్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తుకారాం, ఆర్కా ఖమ్ము, మరప రాజు, పోటే సాయినాథ్, భరత్, రాథోడ్ భీంరావ్, ఉత్తమ్, బీజేపీ నాయకులు రాజలింగు, దీపక్సింగ్షేకావత్, ప్రకాశ్, జైరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 9: మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్రావ్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రమణా రెడ్డి, పీ నగేశ్, పీడీ రమేశ్, పీఈటీ మోహన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, మిలటరీ అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్, వెడ్మ బొజ్జు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, చంద్రయ్య, లాజర్, ఆత్రం రాహుల్, రాజేశ్, ఇక్బాల్, గుణవంత్రావు, ప్రవీణ్, నాగరాజు, అర్జున్ పాల్గొన్నారు.
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతికి మండల కేంద్రంలోని భగత్సింగ్ చౌక్లో బుధవారం రాత్రి భగత్సింగ్ యూత్, తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కే ప్రవీణ్, హరీశ్, పోతన్న, శివ పాల్గొన్నారు. అలాగే సొనాల, బోథ్, పొచ్చెరలో యువకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి పట్ల మండల ప్రజలు నివాళులర్పించారు. మండలంలోని దేగామ, గిర్నూర్, బజార్హత్నూర్, పిప్పిరి గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశ్, రమణ, రాజశేఖర్, భూమేశ్ పాల్గొన్నారు.