తానూర్, జూన్ 28 : స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మసీద్ ప్రహరీ నిర్మాణానికి రూ.7.50 లక్షలు మంజూరు కాగా, ఆ పనులకు బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం కమిటీ హాల్లో ఎమ్మెల్యే విఠల్రెడ్డిని మసీద్ కమి టీ సభ్యులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముస్లింల అభ్యున్నతికి ప్ర త్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ముస్లిం లు చదువులో రాణించేందుకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. బక్రీద్ పండుగను అందరూ కలిసి మెలిసి సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రిని కలిసి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్, హంగిర్గా సొసైటీ చైర్మ న్ నారాయణ్రావు పటేల్, మండల పరిషత్ ఉ పాధ్యక్షుడు జెల్లావార్ చంద్రకాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కానుగంటి పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, మసీద్ కమిటీ అధ్యక్షుడు రఫిక్ఖాన్, ఉపాధ్యక్షుడు ఆహ్మద్, నం ద్గావ్ సర్పంచ్ అబ్దుల్ గనీ, మొగిలి ఎంపీటీసీ సిరిమొల్ల లక్ష్మణ్, ఉప సర్పంచ్ నయీమ్, హంగి ర్గా సొసైటీ డైరెక్టర్ దిగంబర్పటేల్, బీఆర్ఎస్ నాయకులు సూర్యకాంత్ పవార్, భీంపవార్, మై నార్టీ నాయకులు అహ్మద్ హుస్సేన్, అబ్దుల్ కరీం, షాన్వాజ్, మౌలాఖాన్, చోటేఖాన్, తురాబ్ఖాన్, ముక్త్యార్, బడేఖాన్, పూర్ఖాన్, అన్సర్, అబ్దుల్ రహమాన్, నయీమ్, షాన్వాజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు కోల్పోయిన వారికి చెక్కుల పంపిణీ
లోకేశ్వరం, జూన్ 28 : ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన ధర్మోరా, పంచగుడికి చెందిన 50 మంది గ్రామస్తులకు రూ.3.70 కోట్ల పరిహారం మంజూరైంది. ఈ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబ, ఎంపీపీ లలిత-భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, నాయకులు శ్రీధర్, చిన్నారావు, నాలం గంగాధర్, సుదర్శన్ రెడ్డి, దడిగే రాజేశ్వర్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు దిగంబర్, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు బండి ప్రశాంత్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.