లోకేశ్వరం, మార్చి 9 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఈజీఎస్ కింద మంజూరైన రూ. 20 లక్షలతో రాజురా గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే కురుమ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. లోకేశ్వరానికి చెందిన యుగేందర్కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. రాజురాకు చెందిన ఇద్దరికి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎంపీపీ లలితా భోజన్న, చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్ ముత్తాగౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్, నాయకులు కపిల్, బండి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
భైంసాటౌన్, మార్చి 9 : కుంటాల మండలం సూర్యపూర్ గ్రామానికి చెందిన లక్ష్మికి సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దేగాంలోని తన నివాసంలో అందజేశారు. సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.