సీసీసీ నస్పూర్, మే 26: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో భీరన్న స్వామి బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం పాటు నిర్వహించనున్నారు. ఆదివారం భీరన్న ఆలయానికి గొల్లకుర్మలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు.
బోనాలతో వచ్చిన మహిళలు ఆలయం వద్ద పట్నాలు వేసి, స్వామి వారికి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ఒగ్గు పూజారులు కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాకారులు ఒగ్గు కథ చెప్పారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు ఉన్నారు.