డిహత్నూర్, డిసెంబర్ 22 : ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లతో పాటు చదువు, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులు లాభసాటి పంటలు పండించాలన్నారు. సీఎం గిరివికాసం పథకంలో బోరు బావులు మంజూరు చేస్తామని తెలిపారు. మామిడి, జామ, సీతాఫలం పండ్ల తోటలతో పాటు చిరుధాన్యాల పంటలు సాగు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకొని డాక్టర్ సూచనలతో మందులు వాడాలని సూచించారు. అంతకుముందు పీవోకు డప్పులు, వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆయన అభినందిచారు. కార్యక్రమంలోఅదనపు వైద్య శాఖ అధికారులు మనోహార్, సాధన,లయన్స్ క్లబ్ ప్రతినిధులు మధుసూదన్, సుమనసతిరెడ్డి, అశోక్, దయానంద్, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.