ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఉట్నూర్ రూరల్, జూన్ 30: ప్రభుత్వ పాఠశాల ల్లో రాష్ట్ర సర్కారు మెరుగైన వసతులు కల్పిస్తున్న దని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లక్కారం, ఉట్నూర్ ఉర్ధూ పాఠశాల, ఉమ్రి, శ్యాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గురువారం అభివృ ద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అభివృద్ధి చేయ డం జరుగుతున్నదన్నారు. అదేవిధంగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ప్రతి గ్రామంలో క్రీడా మై దానం ఏర్పాటు చేస్తామన్నారు.
తహసీల్దార్ భోజన్న, ఎం పీపీ పంద్ర జైవంత్రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, లక్కారం సర్పంచ్ రాథోడ్ జనార్దన్, శ్యాంపూర్ సర్పంచ్ మల్లిక, పీ ఆర్ డీఈ రమేశ్, ఏఎంసీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్ ఖాన్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమోద్దీన్, కోల సత్తన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, జవ్వాద్ అన్సారీ, భూమన్న, స్వా మి, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొప్పర్ఘడ్ గ్రామానికి చెందిన నానక్రామ్ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.