ఆదిలాబాద్ టౌన్, జనవరి7: పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరు తుందని డీఈవో ప్రణీత అన్నారు. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో ఆదిలాబాద్ డైట్లో శనివారం పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ,బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉపాధ్యాయులు ఐక్యంగా ఇలాంటి ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షించారు. సాంఘి కం ప్రపంచ సమగ్ర చరిత్ర తెలిపే శాస్త్రమన్నారు. కార్యక్ర మం లో డైట్ ప్రిన్సిపల్ కిరణ్కుమార్, వేదిక అధ్యక్ష, కార్యదర్శులు సిలివెరి రాములు, బెదోడ్కర్ సంతోష్కుమార్, ఉపాధ్యక్షులు వెంకట్రావు,సభ్యులు రాజేందర్, రాము, సంతోష్,రాథోడ్, శ్రీకాంత్, ధర్మదాస్ ఉన్నారు.
విజేతలు వీరే..
మొదటి బహుమతి గెడాం అక్షయ, రెండో బహుమతి అమృత, ఆఫ్షా సిద్దా, కేంద్ర సృష్టి తదితరులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఆంగ్లంపై పట్టు సాధించాలి
ఆంగ్లంపై విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి తెలిపారు. నేరడిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లభాష మండల స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలుగా ప్రథమ బహుమతి అవినాశ్(జడ్పీహెచ్ఎస్ నేరడిగొండ), ద్వితీయ బహుమతి పవన్( జడ్పీహెచ్ఎస్ తేజాపూర్), స్టోరీ టెల్లింగ్లో ప్రథమ బహుమతి కార్తీక్(జడ్పీహెచ్ఎస్ కుమారి), ద్వితీయ బహుమతి వైష్ణవిరెడ్డి( జడ్పీహెచ్ఎస్ కుమారి) గెలుచుకున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించనున్న పరీక్షల్లో వీరు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అబ్జర్వర్లుగా గంగాసింగ్, సుజాత, సుభాష్రెడ్డి వ్యవహరించారు. ఉపాధ్యాయులు జగధీశ్వర్రెడ్డి, కిషోర్కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.