తాండూర్, ఫిబ్రవరి 12 : మండల కేంద్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారిపై తాండూర్ పెట్రోల్ పంప్ సమీపంలో డీ ప్రెస్ అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సోమవారం హైదరాబాద్లో ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్ని మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలు వివరించారు.
జాతాయ రహదారి దాటేందుకు సమీపంలో మార్గం లేక ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీలు సిరంగి శంకర్, సూరం రవీందర్రెడ్డి, తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ఈసా, తదితరులు ఉన్నారు.