బెల్లంపల్లిరూరల్, జనవరి 5 : మాదక ద్రవ్యా ల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సద య్య అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థాని క పద్మశాలీ భవన్లో బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత ఖాళీగా ఉండడం వల్లే అనేక వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారని చెప్పారు. యువత చదువుపై దృష్టి సారించాలని, సమ యం దొరికితే మంచి స్నేహితులను కలుస్తూ సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్రీడలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మితే తమకు సమాచారమందించాలని కోరారు. బెల్లంపల్లిరూరల్, మందమర్రి సీఐలు రాజ్కుమార్గౌడ్, మహేందర్రెడ్డితో పాటు సబ్డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.