వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ గోపురాలు, ఆవరణ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. గురువారం వసంత పంచమి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు జరిపించడానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
– బాసర, జనవరి 25
బాసర, జనవరి 25 : బాసరలో వసంత పంచమి ఉత్సవా లు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అమ్మవారికి ప్రభు త్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఐకేరెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు జరిపించడానికి వేలాదిగా తరలి రానున్నారు. దీని కోసం ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు బందోబ స్తు నిర్వహించనున్నారు.
బాసర ఆలయాన్ని గురువారం రా త్రి విద్యుత్దీపాలతో సుందరీకరించారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆల యం మిరుమిట్లు గొలుపుతున్నది. పలువురు భక్తులు ముం దుగానే చేరుకొని ఆలయ ఆవరణలోనే నిద్రించారు. ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకోనున్నారు.