2022-23 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల
ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
నేటి నుంచి ఆన్లైన్లో స్వీకరణ
ఈనెల 30న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
85శాతం స్థానిక, 15 శాతం ఓపెన్ మెరిట్ కోటా
బాసర, జూన్ 30 : రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ (2022-23 విద్యాసం వత్సరం)లో ప్రవేశానికి నోటిఫికేషన్ను డైరెక్టర్ సతీశ్కుమార్ గురువారం విడుదల చేశారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రిజర్వేషన్ల వారీగా 85 శాతం స్థానిక విద్యార్థులతో సీట్లు భర్తీ చేయనుండగా, మిగతా 15 శాతం ఓపెన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మెరిట్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న విడుదల చేయనున్నారు.
ప్రవేశ అర్హతలు..
రిజర్వేషన్లు ఇలా…
ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీఏ 7 శాతం, బీసీబీ 10 శాతం, బీసీసీ 1 శాతం, బీసీడీ 7 శాతం, బీసీఈ 4 శాతం. ప్రత్యేక కేటగిరీలో వికలాంగులకు ఫ్రీ, సైనిక ఉద్యోగులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం భర్తీ చేయనున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ఫీజుల వివరాలు..
రాష్ట్రంలో పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రూ. 36 వేలు చెల్లించాలి. ఫీజ్ రీయంబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్టీ, ఎస్సీలు రూ. 500 చొప్పున చెల్లించాలి. ఇతర రేషన్, గల్ఫ్దేశాల్లో చదివే అభ్యర్థులు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులకు రూ. 3.01 లక్షల ఫీజు చెల్లించాలి.
కౌన్సెలింగ్లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఇచ్చిన రసీదు. మార్కుల లిస్టు, నివాస సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలు అయితే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎస్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
గ్రేడ్పాయింట్లు సమానమైతే ఇలా..
ట్రిపుల్ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత కేటగిరీల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సంబంధిత కేటగిరీల్లో విద్యార్థుల జీపీఏ ఒక్కటయితే వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్ని సమానంగా ఉంటే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం.. ఎవరు పెద్దవారయితే వారికి సీటు కేటాయించనున్నారు. ఇవి కూడా సమానంగా ఉంటే పదోతరగతిలో విద్యార్థి హాల్టికేట్ నంబర్, రాండమ్లో ఎవరికి తక్కువగా ఉంటే వారిని ఎంపిక చేస్తారు.