మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 18 : మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గొడవ ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసిన క్రైం నం బర్ 40/26, 41/26 రెండు కేసులో బాల్క సుమన్, వారి అనుచరులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాల్క సు మన్ న్యాయవాది గడ్డం శ్రీనివాస్, ఆకుల రవీందర్ మాట్లాడుతూ.. సుమన్ రిమాండ్కు సంబంధించి వాదనలు వినిపించగా న్యాయమూర్తి మార్చి 3, 2026 వరకు 14 రోజులపాటు రిమాండ్ను విధించి ఆదిలాబాద్ జిల్లా సబ్ జైలుకు తరలించారన్నారు. మూడు, నాలుగు రోజులుగా రామకృష్ణాపూర్లోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భా గంగా జరుగుతున్న హైడ్రామాలో అక్రమ కేసులు బనాయించారని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
సుమన్ రాళ్లతో పోలీసులపై రాళ్లతో దాడి చేశారని, గోడవకు ప్రేరేపించారని వారు కోర్టుకు సమర్పించిన పె న్ డ్రైవ్ వీడియోలో ఎక్కడ కూడా బాల్క సుమన్ దాడి చేసినట్లు, పాల్గొన్నట్లు కనబడలేదన్నారు. గోడవ చేశారని, ఆరోపణ మాత్రమే ఉందన్నారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ చేయలేదని వాదోపవాదనలు వినిపించామన్నారు. పోలీసుల విచారణ కోసం 14 రోజులపాటు రిమాండ్ అనంతరం విడుదలైన తరువాత ప్రాసిక్యూషన్ వారు ఎలాంటి నిజనిర్ధారణ చేస్తారన్నది చూడాల్సి ఉందన్నారు. బెయిల్ పిటీషన్ కోసం తమ లీగల్ టీంతో చర్చించుకొని జిల్లా కోర్టులో లేదా హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేయనున్నట్లు పేర్కొన్నారు.