ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్, ఏప్రిల్ 5 : ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆపై ఆయన సేవలను కొనియాడారు. ఎస్పీ సురేశ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, డీఎస్పీ సదయ్య, ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.