ఆసిఫాబాద్, జనవరి 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. గూడెం అయ్యప్ప ఆలయ పూజారి పురుషోత్తమాచారి పూజ నిర్వహించగా, కోవ సోనేరావు, లక్ష్మి దంపతులు పూజలో పాల్గొన్నారు. రకరకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, పండ్ల రసాలు, పంచామృతాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన కళకారుల బృందం భజన ఆద్యంతం భక్తులను అలరించింది.
స్వామికి పల్లకీసేవ చేస్తూ మాలధారులు పేటతుల్లి ఆటలతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ దంపతులు, నాయకులు మర్సుకోల సరస్వతి, కోవ సాయినాథ్, జడ్పీటీసీ కోవ అరుణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు చంద్రమోహన్, వినాయక్, మోహన్, శ్యాంసుందర్, శ్రీనివాస్, సంతోష్, బాల రాము, చిట్టిమల్ల సంతోష్, దూడల అశోక్, మడావి శ్రీనివాస్, వెంకట్గౌడ్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.