శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ
ఇంద్రవెల్లి, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగహన కల్పించాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ అన్నారు. మండలంలోని ఏమాయి కుంట గ్రామపంచాయతీ పరిధిలోని ఆంగన్వాడీ కేంద్రంతోపాటు గురుదేవ్ చెరువు, ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్డు, పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు అభి వృద్ధి కార్యక్రమాలు, మహిళా సంఘాల పొదుపు విషయాలను అ డిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్ను నియ మించాలని ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. ఇన్చార్జి ఎంపీడీవో వేణు, ఆర్ఐ మెస్రం లక్ష్మణ్, సర్పంచ్ జాదవ్ లఖన్సింగ్, ఎంపీటీసీ విజయ్సిం గ్, ఎంపీవో సంతోష్కుమార్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, జీపీ కార్య దర్శి విజయ్కుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ అనిత, గ్రామస్తులు ఆరెల్లి రాందాస్, రాజలింగు, రాజేందర్, ఆశోక్, రాధాబాయి, కేతన్బాయి, తదితరులు పాల్గొన్నారు.