ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 7 : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ సివిల్ కోర్టు జడ్జి జితిన్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై, మాట్లాడారు. న్యాయపరమైన చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రక్షణ, మహిళా చట్టాలు, హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్, న్యాయవాదులు మహేంద్ర, శివ, వెంకటేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.