నార్నూర్, జనవరి 25: పంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలోని మాన్కాపూర్ పంచాయతీలో గురువారం క్రీడా ప్రాగంణం,పార్కు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యేను శాలువాతో సన్మానించారు. నిధులు సక్రమంగా వినియోగిస్తూ, పంచాయతీలను అభివృద్ధి ప ర్చుకోవాలని సూచించారు. డిజిటల్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ రాథోడ్ సావీందర్ను అభినందించారు. ఎంపీపీ కనక మోతుబాయి,ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచులు బానోత్ గజానంద్ నాయక్, రూప్దేవ్, రాథోడ్ విష్ణు, ఫడ్ విష్ణు, మెస్రం రూప్దేవ్ పటేల్, ఉపసర్పం చ్ రూప్దేవ్, తదితరులున్నారు.
మండల కేంద్రంలోని ఖాందేవ్ ఆలయంలో తొడసం వంశీయుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి మహాపూ జలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొనగా, ఆలయ కమిటీ, తొడసం వంశీయులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ కనక మోతుబాయి,మాజీ జడ్పీటీసీ రూపావతిజ్ఞానోబాపుష్కర్,ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తొడసం నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.