హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బోర్కడే హేమంత్, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్, మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికను వారు వివరించారు.