ఆసిఫాబాద్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి
మంచిర్యాలలో డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి
ఆసిఫాబాద్ టౌన్, 23 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఒలింపిక్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు నిర్వహించిన ఒలింపిక్ డే రన్లో అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి, ఏఎస్పీ అచ్చేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఈవో ఉదయ్ బాబు, జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి మణెమ్మ, కుమ్రం భీం స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఊశన్న, ఆత్రం యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ఆత్రం వినోద్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ రాకేశ్, సాంబశివరావు, సుదర్శన్, ఎన్ఐఎస్ కోచ్ చునార్కర్ అరవింద్, రవి కుమార్, తిరుమల్, పీఈటీలు సారంగపాణి, తిరుపతి, చిన్నక్క, లక్ష్మి, యాహియ ఫౌండేషన్ చైర్మన్ తారిక్, క్రీడాకారులున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో.. మంచిర్యాల అర్బన్, జూన్ 23 : పట్టణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ను డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్తోకలిసి ప్రారంభించారు. క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు రన్ కొనసాగింది. ఈ రన్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ శ్యాం, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్, ఒలింపిక్ రన్ జాయింట్ సెక్రటరీ రామచంద్ర, చంద్రమోహన్ గౌడ్, సుకుమార్ ఫ్రాన్సిస్, పుల్లూరి సుధాకర్, వివిధ అసోసియేషన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.