ఇంద్రవెల్లి, నవంబర్ 25: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు మెరుగైన విద్యనందించాలని పీవో అంకిత్ సూచించా రు. మండలంలోని వడగాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, ఇంద్రవెల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలతోపాటు ఏకలవ్య గురుకుల పాఠశాలలను గురువా రం ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందించాలని ఆదేశించారు. వంటలను పరిశీలించి ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూంలో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులతోపాటు బియ్యం, గుడ్లు, పుస్తకాలను పరిశీలించి సంబంధిత రికార్డులను పరిశీలించారు. తగరతి గదులకు వెళ్లి వి ద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీల పూ ర్తి వివరాలు తెలుసుకొని, రెగ్యులర్ ఉపాధ్యాయుల రి కార్డులను పరిశీలించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపా ల్ అనిల్కాంబ్లే, వైస్ ప్రిన్సిపాల్ విజయ, గిరిజన ఆ శ్రమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాత్లే గంగారాం, వార్డెన్ ప్రతిమ, వడగాం ఆశ్రమ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడే సంతోష్, ఉపాధ్యాయులు గంగారాం, రాందాస్, పాల్గొన్నారు.
అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ దవాఖానకు వ చ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని పీ వో అంకిత్ సూచించారు. మండల కేంద్రంలోని శ్యాం పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. రిజిష్టర్ను పరిశీలించారు. మందులు, వ్యాక్సి నేషన్, తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్ర మంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు.