జైనూర్, డిసెంబర్ 25 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సాసిమెట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) బుధవారం కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి సాసిమెట్ట ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది.
పొలాల అమవాస్య పండుగకు ఇంటికి వచ్చింది. ఆపై జ్వరంతో పాటు కడుపు నొప్పి రావడంతో ఊట్నూర్లోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. మూడు వారాల క్రితం డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. ఈ క్రమంలో బుధవారం కడుపునొప్పి తీవ్రమై మృతి చెందినట్లు బాలిక తండ్రి ఆత్రం భీం రావు, మామ రాజు తెలిపారు.