వాంకిడి, సెప్టెంబర్ 2 : ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు.
వాంకిడి మండలంలోని బంబార, సోనాపూర్, గోయోగాం గ్రామ పంచాయతీల్లోని ఆసరా లబ్ధిదారులకు శుక్రవారం బంబార గ్రామంలోని రైతు వేదికలో ఆసరా పింఛన్ కార్డులను ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రూ.200 పింఛన్లు ఏమాత్రం సరిపోయేవి కావని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువులకు రూ.2016,దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇచ్చి అండగా నిలుస్తున్నదని తెలిపారు. 57ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతో లక్షలాది మందికి మేలు జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ అజయ్కుమార్, ఎంపీపీ ముండే విమాలాబాయి, సింగిల్ విండో చైర్మన్ జాబోరే పెంటు, వైస్ చైర్మన్ నేతాజీ, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీడీవో, కార్యదర్శులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.
సామాన్యుల అభ్యున్నతే లక్ష్యం
జైనూర్, సెప్టెంబర్ 2: సామాన్యుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్స్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో 125 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, రాష్ట్ర హజ్కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు జాడి రవీందర్, ఎంపీటీసీలు భగవంత్రావు, జుగాదిరావు, రుఖియాబీ, బీబీనూర్, నాయకులు మెస్రం అంబాజీరావు, అహ్మద్ఖాన్, అజ్జులాల, షేక్ అబ్బు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేసీఆర్దే
లింగాపూర్, సెప్టెంబర్ 2: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కే దక్కుతుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. మండలంలో లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేశారు. లింగాపూర్ మండలానికి జూనియర్ కళాశాల, మోడల్ పాఠశాల, సబ్స్టేషన్లకు కావాల్సిన భవనాలు, కనెక్టివిటీ లేని గ్రామాలకు రహదారుల మంజూరు కోసం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం మండలంలోని మోతీపటార్లో ఇటీవల మృతి చెందిన నీలబాయి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదోరావ్, ఎంపీపీ ఆడే సవితా, జడ్పీటీసీ రక్కాబాయి, సర్పంచ్ సుమలత, నేతకాని సంఘం నాయకుడు జాడే రవీందర్, ఎంపీటీసీ రాథోడ్ శివ, బలిరాం, నాయకులు సలాం శేఖర్, పద్మ, సులోచన, సంతోష్, గణపతి, గుణవంత్రావ్, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో ఉమర్ షరీఫ్, కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సమన్యాయం ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు
లక్షెట్టిపేట(దండేపల్లి), సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇటీవల సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ఆసరా లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అప్పటి పాలకులు కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలను ఓట్ల కోసమే వాడుకున్నారని తెలిపారు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్నాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, ఎంపీడీవో మల్లేశ్, వైస్ ఎంపీపీ అనిల్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తిరుపతి, సర్పంచ్లు ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ఆసరా పింఛన్లు
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 2: నిరుపేదలకు చేదోడువాదోడుగా ఆసరా పింఛన్లు ఉపయోగపడతాయని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో 631 మంది పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ జీ వెంకటనారాయణ, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్, పనాస రాజు, మేనేజర్ నాగరాజు, రెవెన్యూ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఆర్పీలు, లబ్ధిదారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలో..
మందమర్రి, సెప్టెంబర్ 2 : మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు చెందిన 954 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, డీఈ ఎం సుమతి, మేనేజర్ రాజేందర్, సెక్షన్ క్లర్క్ ఎండీ సోహైలొద్దీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, మెప్మా టీఎంసీ రఘురాం, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికల్పేట్, సెప్టెంబర్ 2: పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు నాయకులు, అధికారులతో కలిసి అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్ అందించడం దేశ చరిత్రలో ఒక మైలురాయి అని తెలిపారు. తాలూకాలో గత పాలకుల హయాంలో తట్టెడు మట్టిపోయలేని వాళ్లు కూడా నేడు ప్రజా సేవ అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. త్వరలోనే పెద్దవాగు వంతెన అప్రోచ్రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మండలం మొత్తం 353 ఆసరా కార్డులు, ఎనిమిది కల్యాణలక్ష్మి చెక్కులను అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజిమొగ్గ సుజాత, జడ్పీటీసీలు సముద్రాల సరిత, తాళ్లపల్లి రామారావు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు చౌదరి తిరుపతి, కంభగోని సంతోష్గౌడ్, ఎంపీటీసీలు రాజన్న, శారద, మండల కో ఆప్షన్ సాజీద్, సర్పంచ్లు , సీఐ నాగరాజు, ఎస్ఐలు రమణ్కుమార్, జగదీశ్, ఎంపీడీవో గంగాసింగ్, ఇన్చార్జి తహసీల్దార్ రఘునాథ్రావు, పంచాయతీ కార్యదర్శులు, ఆసరా లబ్ధిదారులు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయం
రెబ్బెన, సెప్టెంబర్ 2 : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ సర్కారు నూతనంగా 894 ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పింఛన్ రాని వారి వివరాలు సేకరించి అందేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిథులు, లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.