ఎదులాపురం, జనవరి 19 : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుం చి జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభు త్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతు న్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సందేశాన్ని తయారు చేయాలనీ డీపీఆర్వోను ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానాన్ని చదువను చేసి పారిశుధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ క మిషనర్కు సూచించారు. అలాగే తదితర కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులకు తెలియజేశారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదన పు కలెక్టర్లు ఎస్.నటరాజ్, రిజ్వాన్ భాషా షేక్, ఆ ర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.