భీంపూర్, అక్టోబర్ 26 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, శాశ్వత అభివృద్ధి పనులతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఆయనతోనే మరింత ప్రగతి సాధిస్తుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలం నిపాని, పిప్పల్కోటి గ్రామాల్లో గురువారం డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా పిప్పల్కోటిలోని వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలు, సవారీ బంగ్లాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలు వాడవాడలా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రతినిధి, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న తమ గ్రామంలో ఇంటింటా అందుతున్న పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, రైతు బంధు మండల కన్వీనర్ అనిల్, సర్పంచులు కేమ ప్రమీల, కేమ కల్యాణి, మడావి లింబాజీ, బాదర్, పెండెపు కృష్ణయాదవ్, నిమ్మ వేణు, నాయకులు షేక్ అఫ్రోజ్, నారాయణ రెడ్డి, జీ నరేందర్ యాదవ్, ముకుంద సంతోష్, కపిల్, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.