నార్నూర్, మార్చి 1 : తెలంగాణ ప్రభుత్వం అంధత్వ లోపం ఉన్న బాధితుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గాదిగూడ వైస్ఎంపీపీ యోగేశ్ అన్నారు. గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలోని అంధత్వ లోపం ఉన్న వ్యాధిగ్రస్తులు సకాలంలో వచ్చి పరీక్షలు చేయించుకొని అద్దాలు పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభబాయి, డాక్టర్లు సంజీవ్, స్నేహ, హెచ్ఈవో పవార్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాములు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 1 : మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. కంటి సమస్య ఉన్న వారికి పరీక్షలు చేసి అద్దాలు అందజేశామని డాక్టర్ నరేశ్ తెలిపారు.కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్, మార్చి 1 : మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ మధుకర్, ఉపసర్పంచ్ ఫడ్ విష్ణు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మార్చి 1: మండలంలోని దంతన్పల్లి, హస్నాపూర్, శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. శ్యాంపూర్ పీహెచ్సీ పరిధిలోని చింతకర్రలో డాక్టర్ సందీప్, ప్రవీణ్, దంతన్పల్లి పీహెచ్సీ పరిధిలోని ఉట్నూర్లో డాక్టర్ సంతోష్కుమార్, హస్నాపూర్ పీహెచ్సీ పరిధిలోని నడ్డంగూడలో డాక్టర్ హరిప్రియ కంటి పరీక్షలు చేసి కండ్ల అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
116 మందికి కంటి పరీక్షలు
భీంపూర్, మార్చి 1 : మండలంలోని ఇందూర్పల్లి గ్రామంలో బుధవారం 116 మందికి కంటి పరీక్షలు చేసి ముగ్గురికి అద్దాలు అందజేశారు. 11 మంది కోసం ప్రత్యేక అద్దాలు ఆర్డర్ చేశారు. 31 మందిని కంటి ఆపరేషన్లకు గుర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్ దాదారావ్, కార్యదర్శి మీనాక్షి, డాక్టర్ అశ్విని, హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, లూసి, విష్ణు, సుజాత, తదితరులు పాల్గొన్నారు.